కేంద్ర ప్రభుత్వం జ్ఞానేష్ కుమార్ను కొత్త ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాజీవ్ కుమార్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. రాజీవ్ కుమార్ నిన్ననే పదవీ విరమణ చేశారు. నూతనంగా ప్రకటించిన జ్ఞానేష్ కుమార్ కేరళ కేడర్కు చెందిన 1988 బ్యాచ్ IAS అధికారి మరియు రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ప్యానెల్లోని ఇతర ఇద్దరు కమిషనర్ల కంటే సీనియర్.
తాజాగా ఆయన కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. జ్ఞానేష్ కుమార్ నియమకానికి కేంద్రం ప్రతిపాదించగా.. రాహుల్ గాంధీ వ్యతిరేకించారు. మరోవైపు సీఈసీని ఎంపిక చేసే ప్యానెల్ నుంచి సీజేఐ ను తప్పించడం పై ఇవాళ సుప్రీం కోర్టులో విచారణ జరుగనుంది. 2023లో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను సీఈసీ నియామకంలో పాటించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. తాజాగా బాధ్యతలు చేపట్టిన జ్ఞానేష్ కుమార్ పదవీకి జనవరి 26, 2029 వరకు ఉండనుంది. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ కూడా ఈయన ఆధ్వర్యంలోనే విడుదలయ్యే అవకాశం ఉంది.