హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

-

హిమపర్వతాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అయింది. ఇవాళ ఉదయం 8 గంటలకు హిమాచల్ ప్రదేశ్ లో ప్రారంభమైన ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రక్రియ సాగనుంది. రాష్ట్రంలోని 68 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు- 55,07,261 ఉండగా అందులో పురుషులు 27,80,208, మహిళా ఓటర్లు 22,27,016 ఉన్నారు. ఇక తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లు 1,86,681 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు 7,881 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది.

ఈ ఎన్నికలకు మొత్తం 7881 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 789 పోలింగ్‌ బూత్‌లు సమస్యాత్మకమైనవిగా, 397 పోలింగ్‌ బూత్‌లో అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. 2017 ఎన్నికల్లో 75.57శాతం పోలింగ్‌ నమోదైంది. లాహౌల్-స్పితి జిల్లాలోని స్పితి ప్రాంతంలోని తాషిగ్యాంగ్‌లో 15,256 అడుగుల ఎత్తులో ఈసీ బూత్‌ను ఏర్పాటు చేసింది. ఇక్కడ 52 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబరు 8న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news