కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా..!

-

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. భారత్ పై దీని ప్రభావం మరింత తీవ్రంగా ఉంది. రోజురోజుకి పెరిగిపోతున్న కేసులతో ప్రజలు హడలిపోతున్నారు. సాధారణ ప్రజలతో పాటూ అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. అలాగే ఈ మహమ్మారి సోకి ఇప్పటికే అనేకమంది మరణించగా.. మరికొందరు కొలకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే తాజాగా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ గా తేలింది.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బుధవారం సాయంత్రం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. శరీర ఉష్ణోగ్రతలో మార్పు రావడంతో కరోనా వైరస్ కోసం పరీక్ష జరుపగా పాజిటివ్ గా తేలిందని నితిన్ గడ్కరీ తెలిపారు. ఆయనకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కనీసం ఏడుగురు కేంద్ర మంత్రులు, 20 మందికి పైగా మంది చట్టసభ సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news