​ఆ ల్యాండ్​ స్కామ్​​ జరగలేదట.. రాబర్ట్ వాద్రాకు క్లీన్​చిట్

-

భూమి అమ్మకం విషయంలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఊరట లభించింది. రాబర్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ భూమిని.. డీఎల్​ఎఫ్​కు బదిలీ చేయడంలో ఎటువంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని హర్యానా ప్రభుత్వం.. హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో తెలిపింది.

2014 హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. అప్పటి ముఖ్యమంత్రితో కలిసి రాబర్ట్​ వాద్రా అక్రమ భూలావాదేవీలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై బీజేపీ మాటమార్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలకు.. అధికారంలోకి వచ్చాక క్లీన్ ​చిట్ ఇచ్చింది​. రాబర్ట్​ వాద్రా ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదని తెలిపింది. పంజాబ్ హర్యానా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించింది. రాబక్ట్ వాద్రాకు చెందిన స్కైలైట్ హాస్పిటాలిటీ ల్యాండ్​ను, డీఎల్​ఎఫ్​కు బదిలీ చేయడంలో ఎటువంటి చట్ట ఉల్లంఘనలు జరగలేదని హరియాణా ప్రభుత్వం పేర్కొంది.

“స్కైలైట్ హాస్పిటాలిటీ DLF యూనివర్సల్ లిమిటెడ్‌కు 3.5 ఎకరాలను విక్రయించినట్లు మానేసర్ తహసీల్దార్ నివేదించారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే.. ఈ లావాదేవీలో ఎటువంటి నిబంధనలు ఉల్లంఘన జరగలేదని తేలింది.” అని పంజాబ్ హర్యానా హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ప్రభుత్వం తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news