పరువునష్టం కేసులో రాహుల్ కు ఎదురుదెబ్బ..!

-

కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటిపేరు వ్యవహారంలో అరువు నష్టం కేసు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీకి  చుక్కెదురు అయింది.

ఆయనకు సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షను గుజరాత్ హైకోర్టు సింగిల్ బెంచ్ సమర్థించింది. కాంగ్రెస్ నేతలకు ఊరట నిచ్చేందుకు తగిన అవకాశాలు లేవని న్యాయమూర్తి వాక్యానిస్తూ… శిక్షపై స్టేకు నిరాకరించారు. ఫలితంగా ఇప్పటికే పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోగా… ఇప్పుడు GHC డివిజన్ బెంచ్ కు వెళ్తారా? లేదా? చూడాలి.

ఈ తీర్పు వెలువరించిన హైకోర్టు జస్టిస్ హేమంత్ ప్రచ్చక్… రాహుల్ గాంధీపై కనీసం 10 క్రిమినల్ కేసులు పెండింగులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కేసు తర్వాత కూడా మరికొన్ని కేసులు రాహుల్ పై నమోదు అయ్యాయి. వీర్ సావర్కర్ మనవడు కూడా ఒక కేసు ఫైల్ చేశారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తున్నామని వెల్లడిచింది గుజరాత్ హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Latest news