కోట్లు పెట్టి..లగ్జరీ కారు కొన్న సచిన్‌…అల్లుడి కోసమేనా !

-

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ గురించి ఆయన రికార్డుల గురించి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సచిన్ ఆటల్లోనే కాదు ఆటోమోటివ్ ఔత్సాహికుడు కూడా. సచిన్ గ్యారేజీలోకి మరో విలాసవంతమైన కారు చేరింది. లేటెస్ట్ టాప్ వేరియంట్ మోడల్ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ ఎగ్జరీ కారును సచిన్ కొనుగోలు చేశాడు.

లంబోర్ఘిని ఉరుస్ ఎస్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 4.18 కోట్లుగా ఉంది. ఈ కారు ఉరుస్ లైనప్ లో వచ్చిన రెండవ మోడల్. ఇది ఉరుస్ పెర్ఫార్మంట్ మోడల్ కంటే తక్కువ ధర. ఇక టెండూల్కర్ ఈ లంబోర్ఘిని కారులో ప్రయాణిస్తున్న వీడియోను సిఎస్ 12 వోల్గ్స్ అనే యూట్యూబ్ ఛానల్ షేర్ చేసింది.

కాగా, 2012 నుంచి ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ బ్రాండ్ అంబాసిడర్ గా సచిన్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో అతడి గ్యారేజీలో చాలా బిఎండబ్ల్యూ కార్లు ఉన్నాయి. అదే విధంగా సచిన్ కు మారుతి 800 అంటే చాలా ఇష్టం. ఎందుకంటే సచిన్ తన మొట్టమొదటి కారు ప్రయాణం మారుతీ 800 తోనే ప్రారంభమైంది. 1989 లోనే సచిన్ ఈ కారును కొనుగోలు చేశాడు. ఈ కారు ఇప్పటికీ అతడి గ్యారేజీలో ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అయితే సచిన్ కొన్న కారు ఫోటోలు వైరల్ కావడంతో… తన అల్లుడు గిల్ కోసమే… కొన్నట్లు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version