తమిళనాడులో సంచలనంగా మారిన ఇద్దరు స్వామీజీల గొడవ

-

తమిళనాడులో ఇద్దరు స్వామీజీల మధ్య గొడవ సంచలనంగా మారింది. నువ్వు గొప్ప అంటే నువ్వే గొప్ప అంటూ గుడ్డలు విప్పి కొట్టుకున్నారు ఇద్దరు స్వామీజీలు. ఈ ఘటన తమిళనాడులోని సింగపూర్ లో చోటుచేసుకుంది. తంజావూరు జిల్లా పట్టుకొట్టై కి చెందిన రుద్రసిద్దర్ రాజ్ కుమార్ స్వామీజీ కత్తిని మహిళల కడుపులో పొడిచి రోగాలు నయం చేయడంలో సిద్ధహస్తుడు.

ఈ నేపథ్యంలో తన తండ్రి ఆరోగ్యం నయం చేయడానికి సింగపూర్ కు రావాలని రుద్రసిద్ధర్ రాజ్ కుమార్ స్వామీజీని ఆహ్వానించాడు ఓ భక్తుడు. భక్తుడి కోరిక మేరకు సింగపూర్ వెళ్లారు రాజ్ కుమార్ స్వామీజీ. భక్తుడి ఇంటికి వెళ్లిన సమయంలో ఆ ఇంటిలో ఉన్నాడు సింగపూర్ కు చెందిన హల్క్ స్వామీజీ. ఇద్దరూ భక్తుడిని ఆశీర్వదించిన తర్వాత స్వామీజీల మధ్య పేచీ మొదలైంది.

నువ్వు గొప్ప అంటే నువ్వే గొప్ప అంటూ మాట మాట పెరిగింది. ఆగ్రహంతో రాజ్ కుమార్ స్వామీజీ గొంతు పట్టుకున్నాడు హల్క్ స్వామీజీ. గుడ్డలు విప్పి కొట్టి.. ఇంటి నుండి బయటకు గెంటేశాడు హల్క్ స్వామీజీ.

Read more RELATED
Recommended to you

Latest news