పండగలొస్తున్నాయ్.. జరభద్రం : కేంద్ర మంత్రి మాండవీయ

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నిబంధనలు పాటిస్తూ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయని.. కానీ భారత్​లో మాత్రం తగ్గుతున్నాయని తెలిపారు.

“మహమ్మారిపై పోరాడుతున్న రాష్ట్రాలకు కేంద్రం ఆర్థిక సాయం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 220 కోట్ల వ్యాక్సిన్​ డోసులు అందించాం. ప్రపంచ దేశాల్లో కొవిడ్ విజృంభణను గమనిస్తున్నాము. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. కొవిడ్ కొత్త వేరియంట్‌ను సకాలంలో గుర్తించడానికి జీనోమ్-సీక్వెన్సింగ్‌ను పెంచాలని రాష్ట్రాలకు సూచించాం. త్వరలో వరుస పండుగలు రానున్న నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా మాస్కులు ధరించాలి. శానిటైజర్లు వాడాలి. సామాజిక దూరాన్ని పాటించాలి. ముందు జాగ్రత్తగా ప్రజలు చర్యలు తీసుకోవాలి. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఎయిర్​పోర్టుల్లో కరోనా టెస్టులు చేస్తాం.”–మన్‌సుఖ్‌ మాండవీయ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి

Read more RELATED
Recommended to you

Latest news