సెల్ఫీ తీసుకుందామంటూ.. భర్తను చెట్టుకు కట్టేసి నిప్పుపెట్టిన భార్య

-

దేశవ్యాప్తంగా ఈ మధ్య వివాహేతర సంబంధాల వల్ల హత్యలు ఎక్కువవుతున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని భావిస్తూ.. కొంత మంది తమ భార్యలను.. మరికొంత మంది భర్తలను అతి క్రూరంగా హతమారుస్తున్నారు. ఇంకొన్ని కేసుల్లో తమ జీవితభాగస్వామి అనైతిక సంబంధంలో ఉన్నారని తెలిసి హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన బిహార్​లో చోటుచేసుకుంది.

బిహార్‌లోని ముజఫర్‌పుర్‌ జిల్లాలోని వాసుదేవ్‌పుర్‌ సరాయ్‌ గ్రామానికి చెందిన 25 ఏళ్ల మహిళ.. సెల్ఫీ తీసుకుందామంటూ శనివారం రాత్రి భర్తను ఓ చెట్టు దగ్గరకు తీసుకెళ్లింది. అనంతరం చెట్టుకు కట్టేసింది. అరవకుండా ఉండేందుకు బాధితుడి నోట్లో గుడ్డలు కుక్కింది. ఆ తర్వాత అతడి ఒంటిపై కిరోసిన్‌ చల్లి నిప్పు పెట్టింది. మంటలు చెలరేగడంతో గ్రామస్థులు వచ్చి ఆర్పారు. బాధితుడిని ఆసుపత్రిలో చేర్పించారు. మహిళకు గ్రామంలో మరొకరితో వివాహేతర సంబంధం ఉందని, అందుకే ఇంతటి దారుణానికి ఒడిగట్టిందని స్థానికులు చెబుతున్నారు.  పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news