జులై 6న భారత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఎన్నిక

-

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్​ఐ)లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికను జులై 6న నిర్వహించనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, జమ్ముకశ్మీర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ మహేశ్‌ మిట్టల్‌ కుమార్‌ వెల్లడించారు. భారత రెజ్లింగ్​ సమాఖ్య ఎన్నికకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అంతకుముందు భారత ఒలింపిక్​ సంఘం వెల్లడించింది. అందులో భాగంగా ఎన్నికల రిటర్నింగ్​ అధికారిని నియమించింది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఓ లేఖ రాసింది.

అందులో “డబ్ల్యూఎఫ్‌ఐ కార్యనిర్వాహక కమిటీని నియమించేందుకు ఎన్నికలను నిర్వహించాలని ఐఓఏ నిర్ణయించింది. ఇందుకోసం రిటర్నింగ్‌ ఆఫీసర్‌ బాధ్యతలను చేపట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహాయ రిటర్నింగ్‌ అధికారితోపాటు మరికొంత మంది సిబ్బంది మీకు తోడుగా ఉంటారు” అని పేర్కొంది.

WFI మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్​పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో WFI ప్యానెల్​ను రద్దు చేసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో నూతన కార్యవర్గాన్ని నియమించేందుకు ఐఓఏ ఎన్నికలకు రెడీ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news