అద్భుతం.. అబ్బురపరిచిన నౌకాదశ విన్యాసాలు

-

నౌకాదళ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్‌లో నౌకాదళ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ వేళ నిర్వహిస్తున్న ఈ వేడుకలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విన్యాసాలు తిలకించారు. పాకిస్థాన్ తో 1971లో జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించగా, ఈ ఘనతలో విశాఖ నేవీ స్థావరానికి కూడా కీలకపాత్ర ఉంది. తూర్పు తీరంలో ఉన్న భారత విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను నాశనం చేయాలని పాకిస్థాన్ ఘాజీ అనే జలాంతర్గామిని పంపించింది. అయితే అది లక్ష్యం చేరకముందే విశాఖకు సమీపంలో పెద్ద పేలుడుతో సముద్ర జలాల్లో సమాధి అయింది. ఆనాటి విజయ ఘట్టాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా డిసెంబరు 4న నేవీ డే పేరిట నౌకాదళ విన్యాసాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్ లో నేవీ విన్యాసాలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి విచ్చేసి లాంఛనంగా నేవీ డే విన్యాసాలను ప్రారంభించారు.

Visakhapatnam set for grand Navy Day fete today | NewsTrack English 1

ఆమెకు రక్షణ శాఖ సహాయమంత్రి అజయ్ భట్ స్వాగతం పలికారు. నేవీ డేని పురస్కరించుకుని భారత నేవీ ప్రచురించిన ప్రత్యేక బ్రోచర్ ను ద్రౌపది ముర్ము ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా… నౌకాదళ సిబ్బంది సింధువీర్ జలాంతర్గామి ద్వారా రాష్ట్రపతికి స్వాగతం పలికారు. నేవీ సిబ్బంది అచ్చెరువొందించే రీతిలో విన్యాసాలు చేపట్టారు. చేతక్ హెలికాప్టర్లతో త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తూ గగనవిహారం చేశారు. హెలికాప్టర్ నుంచి నేవీ మెరైన్ కమాండోలు జెమిని బోట్ల లోకి దిగారు. కమాండోలతో కూడిన ఆ బోట్లు ఎంతో వేగంగా తీరానికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా తీరంలో కమాండోలు యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ నిర్వహించారు. విపత్కర పరిస్థితుల్లో శత్రుమూకలపై దాడి చేసే విన్యాసాలను ప్రదర్శించారు. మెరైన్ కమాండోలు ఓ యుద్ధ నౌకలోనూ విన్యాసాలు నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news