రుయా ఆస్పత్రి తరహా ఘటన…. కొడుకు శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన తండ్రి

-

ఏపీలో మరోసారి రుయా ఆస్పత్రి తరహా ఘటన జరిగింది. ఇటీవల అంబులెన్స్ మాఫియా దాష్టీకం వల్ల ఓ తండ్రి కుమారుడి మృతదేహాన్ని బైక్ పై తరలించిన ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. తాజాగా మరోసారి ఇటాంటి ఘటనే నెల్లూర్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. నెల్లూర్- సంగంలో ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. నిన్న( బుధవారం) కాల్వలో పడిన ఇద్దరు చిన్నారులు మరణించారు. వారిలో కొన ఊపిరితో ఉన్న శ్రీరామ్ అనే చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో బాలుడు మరణించాడు. 

బాలుడి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు 108 అంబులెన్స్ ను కల్పించాలని కోరినా.. నిబంధనలు అందుకు అంగీకరింవని చెప్పడంతో దిక్కలేక సదరు తండ్రి, కుమారుడి మృతదేహాన్ని బైక్ పై గ్రామానికి తరలించాడు. మహాప్రస్థానం వాహానం కూడా అందుబాటు లేకపోవడంతో దు:ఖాన్ని దిగమింగుకుని బైక్ పైనే మృతదేహాన్ని తరలించాడు ఆ తండ్రి.

Read more RELATED
Recommended to you

Latest news