నేను దోచుకోలేదు, దాచుకోలేదు: చంద్రబాబు

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జిల్లాలలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా.. బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు చంద్రబాబు. అయితే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండ‌లం ద‌ళ్లవ‌ల‌స‌లో బుధ‌వారం రాత్రి జ‌రిగిన నిర‌స‌న స‌భ‌లో చంద్ర‌బాబు ప్రసంగించారు. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ పాల‌న‌పై విమర్శలు చేసిన చంద్ర‌బాబు.. జ‌గ‌న్ పాల‌న వ‌ల్ల రాష్ట్రం మ‌రో శ్రీలంక అవ‌డం ఖాయ‌మంటూ విమ‌ర్శ‌లు సంధించారు. జ‌గ‌న్ ఒక్క ఛాన్స్ అన‌గానే అంద‌రూ మాయ‌లో ప‌డిపోయార‌న్న చంద్రబాబు.. ఎన్నిక‌ల్లో 151 సీట్ల‌లో గెలుపుతో జ‌గ‌న్‌కు అహంకారం పెరిగింద‌ని మండిపడ్డారు.

త‌న ఇంటిపై దాడి చేసిన వైసీపీ నేత‌లు.. అసెంబ్లీలోనే త‌న‌ను అవ‌మాన‌ప‌ర‌చార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఫైబ‌ర్ నెట్ క‌నెక్ష‌న్ల‌ను తాను రూ.140కే ఇస్తే.. జ‌గ‌న్ ఆ రేటును రూ.290కి పెంచార‌ని మండిప‌డ్డారు చంద్రబాబు. రాష్ట్రంలో విచిత్ర‌మైన మ‌ద్యం బ్రాండ్ల కార‌ణంగా నాటు సారా వినియోగం పెరిగింద‌ని, తాను జ‌గ‌న్ మాదిరి కాద‌న్న చంద్ర‌బాబు.. జ‌గ‌న్ మాదిరిగా తాను దోచుకోలేద‌ని, దాచుకోనూ లేద‌ని సెటైర్లు వేశారు. ఉత్త‌రాంధ్ర‌లో ఒక్క ప్రాజెక్టు ప‌నులైనా పూర్తి చేశార అని చంద్రబాబు ప్రశ్నించారు. అంతేకాకుండా రైతుల మోటార్లకు మాత్రం మీట‌ర్లు పెతానంటూ జ‌గ‌న్ చెబుతున్నార‌ని చంద్రబాబు అగ్రహం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news