హీరో విశాల్ పై విరుచుకు పడ్డ నెటిజన్స్..!!

-

పాపం తమిళ హీరో విశాల్ ట్వీట్ పై నెటిజన్స్ విరుచుకు పడుతున్నారు. గతంలో ఎన్నో సార్లు మోదీ గారిని విమర్శించిన విశాల్  ట్వీట్ లోఆయనను పొగడడమే దీనికి కారణం.అయితే రీసెంట్ గా విశాల్ కాశి కి వెళ్ళాడట,అక్కడ జరిగిన అభివద్ధిని చూసి ఆనంద పడ్డాడట. దీనితో ప్రధాన మంత్రి మోడీ గారిని పొగుడుతూ ట్వీట్ చేశాడు.

modhi

ఆ ట్వీట్ లో నేను కాశీ కి వెళ్లానని ఎంతో బాగా ఉందని, గంగానది ఎంతో పవిత్రంగా మారిందని, చాలా ఈజీ గా అక్కడికి వెళ్లగలుగుతున్నాం. మీరు అద్భుతంగా అభివృద్ధి చేశారంటూ ఇలా విశాల్ ట్వీట్ వేశాడు.ఈ ట్వీట్ పై నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంత మంది సపోర్ట్ చేయగా,చాలా మంది విశాల్ పై విమర్శల వర్షం కురిపించారు.

నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ,ఇప్పుడు నీకు కాశీ, గంగానది నచ్చిందా? గుజరాత్ లో కేబుల్ బ్రిడ్జ్ తెగి అంత మంది చనిపోతే స్పందించలేదు గానీ ఇప్పుడు కాశీ బాగుందని ట్వీట్లు వేస్తున్నావా? అంటూ నెటిజన్లు విరుచుకు పడ్డారు. ముందు నువ్వు నీ సినిమాల మీద దృష్టి పెట్టు నీ సినిమాలు ప్లాప్ అవుతున్నాయి అంటూ విమర్శలు గుప్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news