WTC ఫైనల్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్

-

సౌతాంప్టన్ వేదికగా ఇండియా మరియు న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టెస్టు ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ మొదటి రోజు ఆట నిన్న రద్దు కాగా.. ఇవాళ సౌతాంప్టన్ వేదికగా మరికాసేపట్లో మొదలు కానుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు. ఈ మ్యాచ్ లో ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా బరిలోకి దిగనుంది.

భారత జట్టు : విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రోహిత్ శర్మ, శుభమన్ గిల్ , చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, అశ్విన్, బూమ్రా, మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ

న్యూజిలాండ్ జట్టు : టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (సి), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బిజె వాట్లింగ్ (w), కోలిన్ డి గ్రాండ్‌హోమ్, కైల్ జామిసన్, నీల్ వాగ్నెర్, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్

Read more RELATED
Recommended to you

Latest news