టీడీపీ వైపు కూర్చొని అంబటికి స్లిప్పులు ఇచ్చిన వల్లభనేని

-

ఏపీ అసెంబ్లీలో నాలుగో రోజు హాట్ హాట్‌గా కొన‌సాగాయి. ఇక మ‌రోవైపు అసెంబ్లీలో గురువారం ఆసక్తికర సీన్ కనిపించింది. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శాసనసభలో వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. వంశీని ప్రత్యేక సభ్యుడిగా గుర్తిస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని ప్రకటించిన సంగతి తెలిసిందే. సభలో ఆయనకు ఇష్టం ఉన్న చోట కూర్చోవచ్చని ఆయన తెలిపారు.

అయిన‌ప్ప‌టికీ నాలుగో రోజు సభకు వచ్చిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. టీడీపీ ఎమ్మెల్యేల కూర్చునే మొదటి వరుసలో.. కొండపి ఎమ్మెల్యే బాల వీరాజనేయ స్వామి పక్క సీట్లో వంశీ కూర్చున్నారు. అయితే, 2430 జీవో, మీడియాపై ఆంక్షలు అంశంపై సభలో హాట్ హాట్ గా చర్చ జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు వంశీ స్లిప్పులు రాసి పంపించారు. పలు అంశాలపై ఆయన స్లిప్పులు పంపించడం చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news