బ్రేకింగ్ : నామినేషన్ల విషయంలో ఎస్ఈసీ కీలక నిర్ణయం.

-

బలవంతపు నామినేషన్ల ఉప సంహరణలు.. నామినేషన్లు వేయలేని వారి విషయంలో ఎస్ ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. అదేమంటే అలా ఫిర్యాదు చేసిన వారిలో పలువురికి రీ-నామినేషన్లు వేసుకునే అవకాశం కల్పించింది ఎస్ఈసీ. ఇవాళ, రేపు నామినేషన్లు వేసుకునేందుకు వెసులుబాటు ఇస్తున్నట్టు ఆదేశాలు జారీ అయ్యాయి.

తిరుపతి కార్పొరేషన్ లో 6 డివిజన్ లు, పుంగనూరులో 3 వార్డులు, రాయచోటి లో 2 వార్డుల్లో  పలువురు అభ్యర్దులకు మళ్లీ నామినేషన్ వేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని మూడు వార్జుల్లోని పలువురు అభ్యర్ధులకు రీ-నామినేషన్లకు అవకాశం కల్పించారు. ఇక ఈ అంశం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ అంశం మీద అధికార పక్షం ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news