నితిన్ సాయం రూ.10 లక్షలు

-

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో లాక్ డౌన్ ప్రకటించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు..ప్రజలు ఇంటి నుంచి బయటకు రావొద్దని, వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సినీ సెలబ్రిటీలు కూడా అవగాహన కల్పిస్తున్నామన్నారు…

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో తన వంతు భాగస్వామ్యం అందించాలని హీరో నితిన్ నిర్ణయించుకున్నాడు. కరోనా కట్టడికి రెండు తెలుగు రాష్ట్రాలు చిత్తశుద్దితో కృషి చేస్తున్నాయని ప్రశంశించిన ఆయన, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరో 10 లక్షల రూపాయల విరాళాన్ని నితిన్ ప్రకటించాడు.

మార్చి 31 వ తేదీ వరకూ ప్రకటించిన లాక్ డౌన్ కు ప్రజలు సహకరించాలనీ, అందరూ తమ ఇళ్ళలోనే ఉండి, కోవిడ్19 వ్యాప్తికి నిరోధించడంలో పాలు పంచుకోవాలని ఆయన కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news