నితీష్ భ్రమలో ఉన్నారు – ప్రశాంత్ కిషోర్

-

బీహార్ సీఎం నితీష్ కుమార్ పై పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేడీయును కాంగ్రెస్ లో విలీనం చేయాలని తను సలహా ఇచ్చానని నితీష్ చెప్పడంపై ప్రశాంత్ కిషోర్ స్పందించారు. నితీష్ కు వయసు మీద పడి ఏం మాట్లాడుతున్నారు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. ఏదో మాట్లాడబోయి, ఇంకేదో మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.

ఆయన భ్రమలో ఉన్నారని.. ఎవరినీ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. రాజకీయంగా ఒంటరి వాడవుతున్నారనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. తాను బిజెపి ఏజెండాతో పని చేస్తున్నానని నితీష్ ఆరోపిస్తున్నారని.. అదే నిజమైతే కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని ఎందుకు మాట్లాడతాను? అలా మాట్లాడితే మొదటి స్టేట్మెంట్ తప్పవుతుంది కదా అని పీకే ప్రశ్నించారు. తాను బిజెపి గెలుపు కోసం పనిచేస్తున్నానని నితీష్ చేసిన వ్యాఖ్యలలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆయనకు నమ్మకం లేని వారంతా ఆయన చుట్టూ ఉన్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news