ప్రశాంత్ కిశోర్​తో నితీశ్ కుమార్ భేటీ.. అందుకోసమేనా..?

-

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్​తో బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీ పట్ల రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే నితీశ్ పీకేను ఎందుకు కలిశారనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. ఈ క్రమంలో పీకేతో పట్నాలో భేటీ అయిన మాట వాస్తవమేనని నితీశ్ కుమార్ తెలిపారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉందా లేదా అనే దానిపై క్లారిటీ ఇచ్చేందుకు మాత్రం నితీశ్ నిరాకరించారు.

నీతీశ్​ కుమార్, ప్రశాంత్​ కిశోర్​ మంగళవారం సాయంత్రం పట్నాలో భేటీ అయ్యారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. ఇదే విషయమై బుధవారం నీతీశ్​ను మీడియా మరింత స్పష్టత కోరగా.. ఆయన దాటవేశారు. పీకేతో తనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉందని, అలాంటి వ్యక్తిని కలవడంలో ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల కోసం ప్రశాంత్​తో మళ్లీ కలిసి పనిచేస్తారా అని అడగ్గా.. ఆ ప్రశ్నను పీకేనే అడగాలని మీడియా ప్రతినిధులకు సూచించారు బిహార్ సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news