వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యం : ఖుష్బూ

-

ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి శూన్యమని సినీ నటి, బీజేపీ నేత ఖుష్బూ అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ తరఫున ఆమె ప్రచారం చేశారు. ‘కూటమి గెలిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాగే సీఎం రమేశ్ గెలిస్తేనే అనకాపల్లి అభివృద్ధి సాధిస్తుంది. అందుకే కూటమికి ఓటు వేసి గెలిపించండి’ అని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.

ఏపీలో దాదాపు ఐదు సంవత్సరాల కాలం నుంచి వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందని.. ఈ ప్రభత్వంలో ఏ మాత్రం అభివృద్ధి జరగలేదన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను గెలిపిస్తే.. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు అప్పులు విపరీతంగా పెరుగుతున్నాయని.. అప్పులను గాడిలో పెట్టాలంటే కూటమి రావాలన్నారు. కూటమి అధికారంలోకి వస్తే.. పెండింగ్ లో ఉన్నటువంటి సమస్యలు అన్ని కూడా పరిష్కారం అవుతాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news