మూడు నెలలు ఇంటి అద్దె లేదు వేధిస్తే కఠిన చర్యలు; కేసీఆర్

-

తెలంగాణాలో ఇంటి అద్దె మూడు నెలలు వసూలు చేయవద్దని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసారు. ఇది చట్టప్రకారం మేము ఇస్తున్న ఆదేశాలు అని ఆ తర్వాత వాయిదాల ప్రకారం వసూలు చేసుకోవాలని ఆయన సూచించారు. వేధిస్తే మాత్రం కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మూడు నెలల తర్వాత ఇంటి అద్దెకు వడ్డీ వసూలు చేయవద్దని ఆయన స్పష్టం చేసారు. ఇంటి ఓనర్లు ఇబ్బంది పెడితే 100 కి ఫోన్ చెయ్యాలని సూచించారు..

ఇంటి పన్నుని కూడా వాయిదా వేస్తున్నాం అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఫీజ్ లు పెంచే అవకాసం లేదు. ఫీజ్ లు పెంచకూడదని స్పష్టం చేసారు. ఏ నెల ట్యూషన్ ఫీజు ఆ నెల మాత్రమే వసూలు చెయ్యాలని హెచ్చరించారు. ఎటు వంటి ఫీజులు కూడా వసూలు చేయవద్దని స్పష్టం చేసారు. ఉల్లంఘిస్తే మాత్రం విద్యాసంస్థల అర్హత రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ నెల ఎలా అయితే 12 కేజీలు ఇచ్చారో అలాగే వచ్చే నెల కూడా ఇస్తారని ఆయన పేర్కొన్నారు. ఇక 1500 కూడా ఇస్తామని, మే 7 లోపే అందరికి అందిస్తాం అన్నారు. కొంత మంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఒకసారి ప్రభుత్వం డబ్బులు జమ చేస్తే వాపస్ అయ్యే అవకాశం లేదని, కంగారు పడి బ్యాంకు లకు వెళ్ళవద్దు అని ఆయన సూచించారు. ఆసరా పించన్ లు యధావిధిగా కొనసాగుతాయని అన్నారు.

కొందరి ప్రచారం కారణంగా బ్యాంకులకు రద్దీ పెరుగుతుందని అన్నారు. వలస కూలీలకు కూడా 1500 ఇస్తామని అలాగే 12 కేజీలు బియ్యం ఇస్తామని ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదు కేసీఆర్ వ్యాఖ్యానించారు. కొన్ని పరిశ్రమలు కరెంట్ చార్జీలు వాయిదా వెయ్యాలని కోరారని, మే ఏప్రిల్ మాసాలకు గాను కరెంట్ వాడినా వాడక పోయినా కట్టే కరెంట్ చార్జీలు, కట్టాల్సిన అవసరం లేదని, పాత బిల్లులు చెల్లిస్తే డిస్కౌంట్ ఇస్తామని పేర్కొన్నారు.

వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలియచేసారు కేసీఆర్. ధైర్యం కోల్పోకుండా వారు సేవలు అందిస్తున్నారని అన్నారు. వారికి కావాల్సిన ఎక్విప్మెంట్ అంతా సమకూర్చారమని అన్నారు. గచ్చిబౌలీ స్టేడియం లో ఉండే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని తెలంగాణా ఆరోగ్య శాఖకు బదిలీ చేస్తున్నామని వాళ్లకు దాని మీద అన్ని హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. క్రీడా శాఖా నుంచి తీసుకున్నామని ఆయన వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news