గచ్చిబౌలీ స్టేడియం 1500 పడకల ఆస్పత్రి TIMS గా మారుస్తున్నాం; కేసీఆర్

-

గచ్చీబౌలి లో 1500 పడకల ఆస్పత్రి సిద్దం చేసామని తెలంగాణా సిఎం కేసీఆర్ పేర్కొన్నారు. దానికి టిమ్స్ గా నామకరణం చేస్తున్నామని అన్నారు. క్రీడా శాఖ నుంచి వైద్య శాఖకు దాన్ని బదిలీ చేసామని, క్రీడా శాఖపై కేబినేట్ సబ్ కమిటి వేశామని ఆయన వివరించారు. తెలంగాణా ఇన్స్తిటూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ గా నామకరణం చేసినట్టు పేర్కొన్నారు. అక్కడ వైద్య పరిశోధనలు జరుగుతాయని ఆయన వివరించారు.

వ్యవసాయంకి సంబంధించి ఇండియన్ హిస్టరీ లో ఫస్ట్ టైం రైతులు పండించిన పంటలన్నీ ప్రభుత్వమే కొంటుందని కేసీఆర్ స్పష్టం చేసారు. శ్రీ రాం సాగర్ నుండి ఆరు నెలల పాటు నీరు విడుదల చేసామని అన్నారు. అన్ని రకాల పంటలను ప్రభుత్వమే కొంటుందని ఆయన వివరించారు. మీకు చేరువలో ఉన్న మంత్రులను లేదా రైతు బంధు గ్రూప్ లో సంప్రదించండి అని కేసీఆర్ సూచించారు. ఎరువుల దుకాణాల వద్ద రైతులు గుమి గూడవద్దు అన్నారు.

రైతులకు అందరు గుమి కూడి ఎరువులనురద్దీ లేకుండా మే నెలలోనే కొనుగోలు చేయండి అని సూచించారు, తెలంగాణాలో పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఉండవు కాబట్టి ఆ హాల్స్ ని ఎరువుల గౌదాన్ లు గా వాడుకోవాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే కలెక్టర్లకు సూచనలు చేసామని పేర్కొన్నారు. రైతులు వెంటనే ఎరువులను కొనుక్కోవాలని ఆయన విజ్ఞప్తి చేసారు. రాష్ట్రానికి కావలసినంత స్టాక్ ఎరువులు ఉన్నాయన్నారు.

వ్యాధి తగ్గుతుంది అనుకున్నాం కాని తగ్గలేదని, ఇక నుంచి కఠినం గా ఉంటామని ఆయన స్పష్టం చేసారు. ప్రజలు అందరూ కూడా ఇందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేసారు. అందరూ సమర్ధవంతంగా ఉంటే దీన్ని ఎదుర్కొంటామని అన్నారు. కరోనా వైరస్ కి అసలు మందు లేదని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంకా భయంకరంగా పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు.

ప్రజల సంక్షేమం కోసం ఈ విధమైన నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ధైర్యంగా ఉండి కరోనా ని ఎదుర్కోవాలని కోరారు. మన పొట్ట మనమే నింపుకోవాలని మన దేశానికి ఏ దేశం కూడా అన్నం పెట్టే పరిస్థితి లేదు కాబట్టి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కొనసాగించాలని అనుకున్నామని వివరించారు. భారత్ ఎవరిని అడుక్కునే పరిస్థితిలో లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణా కంటే వంద దేశాలు చిన్నవి అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news