ప్రమాదానికి గురైన ఏపీ ప్రయాణికులు ఎవ్వరూ మిస్ కాలేదు: మంత్రి అమర్నాధ్ ప్రకటన

-

గత మూడు రోజుల క్రితం జరిగిన కోరమాండల్ – హౌరా – గూడ్స్ రైలు ప్రమాదంలో ఒరిస్సా , వెస్ట్ బెంగాల్ ప్రజలతో పాటుగా ఏపీ నుండి కూడా కొందరు ప్రయాణికులు ఉన్నారు. అధికారులు తెలియచేస్తున్న వివరాల ప్రకారం చనిపోయిన వారి సంఖ్య 300 కుపైగా ఉందట. కాగా ఈ ప్రమాదంలో మరణించిన వారిలో ఏపీ నుండి కేవలం ఒక్కరు మాత్రమే మరణించినట్లు కాసేపటి క్రితమే ఏపీ మంత్రి గుడివాడ అమర్నాధ్ క్లారిటీ ఇచ్చారు, తెలుస్తున్న సమాచారం ప్రకారం గురుమూర్తి అనే వ్యక్తి మరణించారా. అంతే కాకుండా ఈ ట్రైన్ లో ప్రయాణించిన ఎవరూ కూడా మిస్ కాలేదని కంఫర్మ్ చేశారు. ప్రస్తుతానికి ఈ ప్రమాదాన్ని మానిటర్ చేసుకుంటూ ఏపీలోని అన్ని కంట్రోల్ రూమ్ లు యాక్టీవ్ గా ఉన్నాయని మంత్రి తెలిపారు.

కొందరు ఇంకా హాస్పిటల్స్ లో ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వారు కూడా సురక్షితంగా ప్రాణాలతో బయటకు రావాలని ఆశిద్దాం.

Read more RELATED
Recommended to you

Latest news