ఆ హీరోయిన్ తో నాకు సంబంధం లేదు..!!

-

ప్రముఖ నిర్మాత అల్లు అవరవింద్ కొడుకు అల్లు శిరీష్, గౌరవం చిత్రంతో టాలీవుడ్ ఇచ్చాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా గాని  ఏవి విజయం సాధించలేదు. ఒక పక్క అల్లు అర్జున్ కెరియర్ రాకెట్ లాగా దూసుకొని పోతుంటే తన పరిస్థితి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు వుంది. అలాగే ఈ మధ్య కుటుంబం తో కలవడం లేదని వారి మధ్య గొడవలు వున్నాయని ప్రచారం కూడా జరిగింది.

కాని తాను మాత్రం హిట్ కోసం విడవకుండా పట్టుదల తో చాలా ప్రయత్నాలు చేస్తునే వున్నాడు.  తాజాగా అల్లు శిరీష్  హీరోగా నటించిన సినిమా  ఊర్వశి వో రాక్షసివో. రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్ గా నటిస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని, నవంబర్ 4న ఈ చిత్రం థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్ లో పాల్గొంటోంది చిత్ర యూనిట్. దానిలో  భాగాంగా అల్లు శిరీష్ వరుసగా ఇంటర్వ్యలు ఇస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌ తో రిలేషన్ వార్తల పై వివరణ ఇచ్చారు.

 వాస్తవానికి ఈ సినిమా టీజర్లో రొమాన్స్ మోతాదు మించడంతో పాటు , ఇద్దరూ కొన్ని సార్లు రెస్టారెంట్స్ దగ్గర కనిపించడం తో  ఉండడంతో, ఇద్దరి మధ్య రిలేషన్ షిప్ వుందని  సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో తాజాగా స్పందించిన శిరీష్ ఆ రూమర్స్ ను కొట్టి పడేశాడు. సినీ తారలపై ఇలాంటి రూమర్స్ వస్తూనే వుంటాయని  చెప్పిన శిరీష్, గతంలో ఇలాంటి రూమర్స్ తనపై చాలానే వచ్చాయన్నారు. అను ఇమ్మాన్యుయేల్‌ తో రిలేషన్ షిప్ లో లేనని, ప్రస్తుతం తామిద్దరం మంచి స్నేహితులం అని అల్లు శిరీష్ వివరించాడు.

Read more RELATED
Recommended to you

Latest news