దంపతులకు ఎస్సై కౌన్సెలింగ్‌.. మధ్యలోనే పెట్రోల్ పోసుకుని భార్య ఆత్మహత్య

-

నాలుగు నెలల క్రితం పెళ్లి చేసుకున్న ఓ జంట మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్య ఫిర్యాదుతో పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చేందుకు స్టేషన్ కు పిలిపించారు. ఎస్సై కౌన్సెలింగ్ ఇస్తుండగా ఆ వివాహిత బయటకు వెళ్లి పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్రమత్తమైన పోలీసులు కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

గుంటూరుకు చెందిన శ్రావణి(30)కి విశాఖకు చెందిన వినయ్‌తో నాలుగు నెలల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండటంతో శ్రావణి బుధవారం మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఇద్దరినీ గురువారం ఉదయం కౌన్సెలింగ్ నిమిత్తం స్టేషన్‌కు పిలిపించారు.

దంపతులకు ఎస్సై శ్రీనివాస్‌ కౌన్సెలింగ్‌ ఇస్తుండగా.. శ్రావణి ఫోన్‌లో మాట్లాడుతూ బయటకు వెళ్లి పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు యత్నించారు. మంటలను ఆర్పే క్రమంలో ఎస్సై శ్రీనివాస్‌ చేతికి గాయాలయ్యాయి.

తీవ్ర గాయాలపాలైన శ్రావణిని పోలీసులు సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూ ఆమె మృతిచెందింది. దీంతో పోలీసులు గుంటూరులోని శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీసీపీ సుమిత్‌ సునీల్, ఏసీపీ మూర్తి, సీఐ ప్రసాద్‌లు విచారణ చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news