కన్నా లక్ష్మీ నారాయణ కి వెన్నుపోట్లు ?

-

ఓవైపు కరోనా వైరస్ తో జనం పోరాటం చేస్తుంటే ఏపీలో పార్టీల మధ్య రాజకీయం నడుస్తోంది. ముఖ్యంగా వైసీపీ బీజేపీ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్నట్టుగా పరిస్థితులు నెలకొంటున్నాయి. రాపిడ్ టెస్టింగ్ కిట్స్ విషయం లో ఏపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని కన్నా లక్ష్మీనారాయణ ఇదివరకే ఆరోపణలు చేయటం మనందరికీ తెలిసినవే. అయితే కన్నా చేసిన ఆరోపణలపై చాలా స్ట్రాంగ్ గా ఘాటుగా విజయసాయిరెడ్డి రిప్లై ఇవ్వటం తో ఇప్పుడు ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ వర్సెస్ వైసిపి అన్నట్టు సీన్ మారింది. Capital change is only for exploitation: Kanna Lakshmi Narayana ...ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ ని పట్టుకుని 20 కోట్లకు చంద్రబాబుకి కన్నా అమ్ముడుపోయారని విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సొంత పార్టీ నేతలు ఎవరూ ఇప్పటి వరకు ప్రతి స్పందించకపోవటం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజెపి పార్టీలో రెండు వర్గాలు ఒకటి కన్నా లక్ష్మీనారాయణ వర్గం అయితే మరొకటి బిజెపి జాతీయ నాయకుడు జీవీఎల్ వర్గం అని చాలామంది అంటారు.

పరిస్థితి ఇలా ఉండగా వ్యవహారం మొత్తం అదుపు తప్పెలా కనిపిస్తూ ఉండడం తో విజయ సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజం అన్నట్టుగానే నమ్మ వలసిన పరిస్థితి ప్రస్తుతం కనబడుతుంది. ఈ విషయం నడుస్తూ ఉండగానే కేంద్ర బిజెపి పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ కి ఫోన్ చేసి మరీ చీవాట్లు పెట్టారట. దీంతో విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ బీజేపీ నేతలు ఎవరు ఖండించక పోవడంతో సొంత పార్టీ నుంచే కన్నా లక్ష్మీనారాయణ కి వెన్నుపోట్లు పొడిచినట్లు అయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news