మళ్లీ తన కూతురితో కనిపించిన కిమ్.. ఫొటో వైరల్

-

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కుమార్తె మళ్లీ వార్తల్లో నిలిచింది. కిమ్ మళ్లీ తన కుమార్తె కిమ్‌-జు-యేతో కలిసి కనిపించారు. దేశ సైనిక వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా బుధవారం ఆయన సైనికాధికారులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కుమార్తె కూడా ఉంది. ఈ ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది.

త్వరలో భారీ సైనిక కవాతు జరగనుందని, అందులో ఉత్తరకొరియా తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపనుందన్న వార్తలొస్తున్న నేపథ్యంలో కిమ్‌.. సైన్యంలోని ప్రముఖలతో భేటీ అవ్వడం విశేషం. కుమార్తెతో కలిసి కిమ్‌ కనిపించడం ఇది నాలుగో సారి. ఇలా పదే పదే కుమార్తెతో ప్రత్యక్షమవ్వడం వెనుక.. భవిష్యత్తులో పగ్గాలు తన వారసులకే దక్కుతాయన్న సంకేతాలను కిమ్‌ పంపుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. కిమ్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news