BREAKING : టెన్త్ పేపర్ ఇష్యూ.. ఈటలకు నోటీసులు

-

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. 10th క్లాస్ పేపర్ లీకేజ్ కేసులో ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ అయ్యాయి. కమలాపూర్ లో పేపర్ లీకేజ్ పై ఈటెల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు వరంగల్ పోలీసులు.

హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు ప్రశాంత్..పేపర్ ను పంపాడు. 10 పేపర్ లీకేజ్ కు హుజురాబాద్ నియోజకవర్గంనే ఎందుకు ఎంచుకున్నారన్న దాని పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ తరుణంలోనే.. ఈటల రాజేందర్ తో పాటు , ఆయన పీఏ లకు నోటీసులు ఇవ్వనున్నారు వరంగల్ పోలీసులు. సంజయ్ , ప్రశాంత్ ను వారం రోజులపాటు కస్టడీ కావాలంటూ కోర్టులో పిటిషన్ వేయనున్నారు వరంగల్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news