డ్రగ్స్ కేసులో తనీష్ కి నోటీసులు ?

-

బెంగళూరు డ్రగ్స్ కేసులో సినీ నటుడు తనీష్ కి నోటీసులు జారీ అయ్యాయి. ఈరోజు విచారణకు హాజరు కావాలని బాణసవాడి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తెలుగు సినీ నటుడు తనీష్‌తోపాటు మరో ఐదుగురిని శనివారం విచారణకు రావాలని నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. వీరిలో ఓ ఇండస్ట్రియలిస్ట్, సినీ నిర్మాత ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో ఇద్దరు విదేశీయులను అరెస్ట్ చేసిన బెంగళూరు పోలీసులు వారిచ్చిన సమాచారంతోనే మస్తాన్‌, విక్కి మల్హోత్రా అనే పేర్లు కనుక్కున్నారు.

మస్తాన్‌ను విచారించగా సినీ నిర్మాత శంకరగౌడ పేరు వెలుగులోకి వచ్చింది. ఇక గతంలో శంకర్ గౌడ్ ఆరెంజ్ చేసిన పార్టీకి వెళ్లిన అందరికీ నోటీసులు జారీ చేశారు. తనీష్ , మస్తాన్ లతో పాటు మరో అయిదుగురికి బెంగళూరు గోవిందపురా పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తనీష్ మాత్రం నాకు ఎలాంటి నోటీసులు అందలేదు అని అంటున్నారు. తానూ హైదరాబాద్ లో ఉన్నానని అంటున్నారు. ఇక తనీష్  2017 జులైలో జరిగిన మాదకద్రవ్యాల కేసులో కూడా తనీష్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. 

Read more RELATED
Recommended to you

Latest news