OLA CAR : ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు రయ్ రయ్..

-

ఎలక్ట్రిక్ స్కూటర్ల విభాగంలో తనదైన ముద్ర వేసిన ఓలా.. ఇప్పుడు అదే విభాగంలో మరో ప్రాడక్ట్ తో ముందుకు వస్తోంది. అదే ఓలా ఎలక్ట్రిక్ కారు. ఈ కారు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి వస్తోందని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవీష్ అగర్వాల్ తెలిపారు. అయితే ఈ కారు ఒక్కసారి రీఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లు రయ్ రయ్ మంటూ సాగుతోందట. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్‌ తమ తొలి స్కూటర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసారి తమ విద్యుత్తు కారు ఆవిష్కరిస్తోంది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇవాళ మూడు సరికొత్త మోడళ్ల ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసేందుకు ఓలా ఎలక్ట్రిక్ సన్నాహాలు చేస్తోంది. ఈ కార్లలో 2170 లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుందని.. ఒకసారి చార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్లకుపైగా ప్రయాణించవచ్చని సమాచారం. ఈ కార్లపై అంచనాలను పెంచేలా ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ ఇటీవల ట్వీట్ చేశారు. అధునాతన ఫీచర్లతో ఈ కార్లు వస్తాయని ఆయన తెలిపారు. కూప్, సెడాన్, ఎస్ యూ వీ అనే మూడు బాడీ మోడళ్లలో ఈ కార్లు వచ్చే అవకాశం ఉందని వాహన మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

కార్ల తయారీ రంగంలోకి తాము ప్రవేశించనున్నట్లు భవీష్‌ కొన్ని నెలల క్రితమే ప్రకటించారు. ఈ క్రమంలో జూన్‌లో ఓలా తమ కారుకి సంబంధించిన టీజర్‌ను ట్వీట్‌ చేసింది. వెనుక, ముందు భాగం డిజైన్‌లను అందులో బహిర్గతం చేసింది. ఓలా అలే లోగో కూడా అందులో కనిపించింది. డిజైన్‌ను బట్టి సెడాన్‌ సెగ్మెంట్‌లో ఈ కారును విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. ఇప్పటికే కార్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన ఓలా 1,000 ఎకరాల స్థలం కోసం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలతో కంపెనీ చర్చలు జరుపుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news