Big Breaking : మరో నోటిఫికేషన్‌ విడుదల.. ఈ సారి ఆ శాఖల్లో

-

తెలంగాణ ప్రభుత్వం వెనువెంటనే నోటిఫికేషన్‌లు విడుదల చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవలే గ్రూప్‌-1, పోలీస్‌ శాఖ ఉద్యోగల భర్తీకి రెండు నోటిఫికేషన్లను విడుదల చేసిన కేసీఆర్‌ సర్కార్‌ ఇప్పుడు మూడో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో తెలంగాణ నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎక్సైజ్, ర‌వాణా శాఖ‌లో 677 ఉద్యోగాల భర్తీకి గ్నీన్‌ సిగ్నల్‌ ఇస్తూ.. తెలంగాణ సర్కార్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ శాఖల్లో.. ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్(హెచ్‌వో) 6 పోస్టులు, ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్‌(ఎల్‌సీ) 57 పోస్టులు, ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టుల 614కు నోటిఫికేష‌న్ వెలువ‌డింది. అర్హులైన అభ్య‌ర్థుల నుంచి మే 2 నుంచి 20వ తేదీ వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.tslprb.in వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.

Emblem of Telangana - Wikipedia

ఇదిలా ఉంటే.. మొత్తం 16,614 పోలీసు ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్‌ను ప్ర‌భుత్వం జారీ చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో 16,027 కానిస్టేబుల్ ఉద్యోగాలు కాగా, మిగ‌తా 587 ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భ‌ర్తీకి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించ‌నున్నారు. దీంతో పాటు.. 503 గ్రూప్‌-1 పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయగా.. ఇందులో డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు 42, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీసు-91, కమర్షియల్‌ ట్యాక్స్‌ ఆఫీసర్‌-48, మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌-2 పోస్టులు-41, అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌-38, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌-40, ఎంపీడీవో పోస్టులు-121తో పాటు మరికొన్ని పోస్టులు ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news