యదాద్రి భక్తులకు శుభవార్త.. అందుబాటులోకి ఆన్లైన్ సేవలు

-

యాదాద్రి వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు సులభతర సేవలు అందించేందుకు అధికారులు ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో అన్ని రకాల సేవలను మొబైల్ లోనే బుకింగ్ చేసుకోవచ్చును అని యాదాద్రి ఆలయ కమిటీ పేర్కొంది.

Yadadritemple.telangana.gov.in అనే వెబ్సైట్ లో భక్తులు తమకు కావలసిన సేవలను పొందవచ్చు. కాగా ఇటీవల తిరుమల తిరుపతి తరహాలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ అధికారులు కూడా బ్రేక్ దర్శనాల టికెట్లను తీసుకువచ్చారు. ఇక ఇప్పుడు ఆన్లైన్ సేవలను తీసుకొచ్చి భక్తులకు సేవలను సులభతరంగా అందిస్తున్నారు.

 

https://yadadritemple.telangana.gov.in/

Read more RELATED
Recommended to you

Latest news