ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు అమ్ముడుపోయాయి: వైయస్ షర్మిల

-

వైయస్ఆర్ తెలంగాణ పార్టీ చేపడుతున్న ప్రజాప్రస్థానం యాత్ర శనివారం తో 112 వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ప్రజాప్రస్థాన యాత్రలొ భాగంగా హుజూర్ నగర్లో పర్యటిస్తున్నారు వైయస్ షర్మిల. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ను నిలదీస్తూ ఓ ట్వీట్ చేశారు. మాట మీద నిలబడటం అంటే ఏమిటో కేసీఆర్ కు తెలియదని విమర్శించారు. ఓట్లు కావలసినప్పుడు రావడం, మాయమాటలు చెప్పడం, మళ్ళీ ఫామ్ హౌస్ కి వెళ్లడం.. 8 ఏళ్లుగా ఇదే తీరుతో కేసీఆర్ పాలన నడుస్తోందని వైయస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు అమ్ముడుపోయాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల తరపున పోరాటం చేయడానికే వై.ఎస్.ఆర్ తెలంగాణ పార్టీ పుట్టిందని ఆమె ట్వీట్ చేశారు. ప్రజాప్రస్థానం యాత్ర పేరుతో షర్మిల తెలంగాణలో పర్యటిస్తూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news