బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి హాట్ కామెంట్స్

-

బీజేపీ ప్రభుత్వంపై విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ అల్వా హాట్ కామెంట్స్ చేశారు. పెద్దన్న రాజకీయ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని పరోక్షంగా విమర్శించారు. ఈ తరహా భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందని ఆరోపించారు. ట్విట్టర్ వేదికగా.. ఆమె బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. పెద్దన్న ఎప్పుడూ చూస్తూ.. వింటున్నాడనే భయం ప్రతిపక్ష నేతల్లో ఉందన్నారు. ఆ భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందన్నారు.

మార్గరెట్ అల్వా
మార్గరెట్ అల్వా

బీఎస్ఎన్ఎల్‌ని ట్విట్టర్‌లో ట్యాగ్ చేస్తూ.. ప్రతిపక్ష నేతలు మాట్లాడే మాటలను ట్రాప్ చేస్తున్నారని మార్గరెట్ అల్వా ఆరోపించారు. బీజేపీలో కొంత మంది స్నేహితులతో మాట్లాడిన తర్వాతే తమ కాల్స్ డైవర్ట్ అవుతున్నాయనే విషయం తెలిసిందన్నారు. కాగా, ఈ ట్విట్‌పై బీఎస్ఎన్ఎల్ స్పందించింది. దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఈ విషయంపై కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి స్పందించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఫలితాలపై తమకు నమ్మకం ఉందన్నారు. అల్వా ఫోన్ ట్యాప్ చేయాలని ఎవరికీ ఉందని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news