ఆర్థిక సంక్షోభంలో పాకిస్థాన్.. అడుక్కునే దుస్థితికి రావడం సిగ్గుచేటని ప్రధాని ఆవేదన

-

ఓ అణ్వస్త్ర దేశం అడుక్కోవాల్సిన రావడం సిగ్గుచేటని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ దుస్థితిపై ఆయన మరోసారి ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మరిన్ని రుణాలు కోరడం తనకు ఇబ్బంది కలిగించిందని చెప్పారు. దేశ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు విదేశీ రుణాలు సరైన పరిష్కారం కాదని, వాటిని మళ్లీ చెల్లించాల్సి ఉంటుందని షెహబాజ్‌ తెలిపినట్లు ఓ వార్తాసంస్థ వెల్లడించింది.

కొంత కాలంగా పాక్‌ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు 4.3 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. వాణిజ్య బ్యాంకులతో కలిపి సుమారు 10.18 బిలియన్‌ డాలర్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. గత తొమ్మిదేళ్లలో ఇదే అత్యల్పం. రుణాల విషయంలో మిత్రదేశాలు కూడా మమ్మల్ని బిచ్చగాళ్లలా చూస్తున్నాయని షెహబాజ్‌ షరీఫ్‌ గతంలోనూ ఓసారి ఆవేదన వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news