వన్‌ నేషన్-వన్‌ రేషన్‌ పై పవన్‌ కామెంట్..!

-

క‌రోనా క‌ష్టాల‌తో ఉపాధి అవ‌కాశాలు దెబ్బ‌తిన్న స‌మ‌యంలో పేద ప్ర‌జ‌ల‌కు గుడ్‌ న్యూస్ చెప్పారు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. దేశంలో పేదలు ఎక్కడి నుంచి అయినా రేషన్ తీసుకోవచ్చు అని వెల్ల‌డించారు.. కుటుంబంలోని ప్రతీ ఒక్కరికి 5 కిలోల‌ గోధుమలు లేదా 5 కిలోల బియ్యం, కిలో కందిప‌ప్పు ఇస్తామని తెలిపారు. ఉచిత రేష‌న్ కోసం రూ.90 కోట్లు విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ప్ర‌ధాని మోడీ. కాగా, మోదీ ప్రవేశపెట్టిన వన్‌ నేషన్ వన్‌ రేషన్‌ కోట్ల మంది వలస కార్మికులకు ఉపయోగపడుతుందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

పీఎం గరీబ్‌ కల్యాణ్‌ యోజన పొడగింపు, ఉచిత రేషన్‌ను నవంబర్‌ వరకు పొడగించడం అభినందనీయమన్నారు. ఉచిత రేషన్‌ 80 కోట్ల మంది భారతీయుల ఆకలి కేకలను తీర్చడానికి ఉపయోగ పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోడీకి ట్విట్టర్‌ వేదికగా ధన్యవాదాలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Latest news