చంద్రబాబుకు దత్తపుత్రుడిగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు – మంత్రి కాకాని

-

చంద్రబాబు పవన్ ఒక్కటేనని గతంలో చాలా సార్లు చెప్పామని.. ఇప్పుడు దాన్ని వారు నిజం చేశారని అన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. చంద్రబాబుకు దత్తపుత్రుడుగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారని అన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు డైరెక్షన్.. పవన్ యాక్షన్ గా సాగింది.. ఇప్పుడు ఇద్దరూ బయట పడ్డారని అన్నారు. ఇద్దరి మధ్య రహస్య ఒప్పందం ఉందని ముందు నుంచీ చెబుతున్నామన్నారు.

పవన్ కళ్యాణ్ కు ఒక అజెండా లేదన్నారు మంత్రి కాకాని. వైసీపీ నేతలపై పవన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. ఒక పార్టీకి అధినేతగా ఉంటూ ఆ విధంగా మాట్లాడటం చూస్తే ఆయన నైజం అర్థమవుతుందని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినా ఒరిగేది ఏమీ ఉండదన్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని.. 2014 – 2019 లలో ఒంటరిగా పోటీ చేసాం.. 2024 లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news