పవర్ స్టార్ ఫ్యాన్స్​కు పండగే.. మామాఅల్లుళ్ల మల్టీస్టారర్ షురూ

-

పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ షూటింగ్ ఇవాళ ప్రారంభమైంది. ఈ సినిమా తమిళ మూవీ ‘వినోదయ సీతమ్’ అనే చిత్రానికి రీమేక్​గా తెరకెక్కుతోంది. దర్శకుడు, నటుడు సముద్రఖని స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తమిళంలో నిర్మించారు. ఇప్పుడు తెలుగు రీమేక్‌ వర్షన్‌కు కూడా ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు.

పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ, జీస్టూడియోస్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైలాగులు అందిస్తున్నారు. స్క్రీన్ ప్లే కూడా ఆయనే రాస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని తెలుగుకు కావాల్సిన మార్పులు, చేర్పులు చేశారట.

ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌లో ఇవాళ షురూ చేశారు. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ వచ్చారు. అందుకు సంబంధించిన చిత్రాలు సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది ‘వినోదయ సీతమ్’ సినిమాలో మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుడి పాత్రను పవన్ కల్యాణ్​ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. పవన్​కు జోడీగా కేతిక శర్మగా కనపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news