రూటు మార్చిన పవన్ క‌ళ్యాణ్.. బీజేపీపై పొగడ్తలు..

-

బీజేపీ పెద్దలపై జనసేన అధినేత చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మధ్యకాలం వరకు బీజేపీని, అమిత్ షాని తిట్టిపోసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఒక్కసారిగా రూట్ మార్చేశారు. ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న పవన్.. బీజేపీ చీఫ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రస్తావన తీసుకురావడం సంచలనంగా మారింది. తిరుపతిలో పార్టీ సమావేశంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్… ప్రస్తుతం ఉన్న దేశ రాజకీయాలకు మోదీ, అమిత్ షా వంటి వ్యక్తులే కరెక్ట్ అని, అలాంటి వారే అన్యాయాన్ని ఉక్కుపాదంతో అణిచివేస్తారంటూ పవన్ కామెంట్ చేశారు. ఆ భయం వీళ్లకు ఉందని, అందుకే వాళ్ళను చూసి భయపడుతున్నారంటూ వైసీపీని టార్గెట్ చేశారు.

అదే విధంగా నేనెప్పుడూ నేను బిజెపికి దూరంగా లేన‌ని.. ప్రత్యేక హోదా కోసమే బిజెపితో విభేదించి ఎన్నికల్లో ఒంటరిగా పోటి చేశాన‌ని అన‌డం గమనార్హం. అలాగే తెలుగుదేశం, బీజేపీ క‌లిపి ప‌ని చేస్తే అధికారంలోకి వ‌స్తుంద‌న‌డం కొస మెరుపు. ఏదేమైన‌ ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ అమిత్ షా ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారనే దానిపై రాజకీయవర్గాల్లో అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఏపీలో అధికార వైసీపీని ఢీ కొట్టాలంటే బీజేపీలో జనసేనను విలీనం చేయడం ఒక్కటే మార్గమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని… అందుకే ఈ రకమైన వ్యాఖ్యలు ఆయన నోటి వెంట వచ్చాయని పలువురు చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news