ఏపీ నూతన గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్ నియామకం అయిన విషయం తెలిసిందే. ఏపీకి కొత్త గవర్నర్ గా ఎస్ అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. అబ్దుల్ నజీర్.. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కూడా గతంలో పనిచేశారు. ప్రస్తుత ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరి చందన్ ను చత్తీస్గడ్ గవర్నర్ గా బదిలీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన గవర్నర్ గా నియమితులైనజస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

“ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్ గా నియమితులైన జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ గారికి నా తరఫున, జనసేన పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పలు కీలక తీర్పులు వెలువరించారు. నిష్పాక్షికంగా రాజ్యాంగం నిర్దేశించిన సూత్రాలకు లోబడి తీర్పులు ఇచ్చి, న్యాయమూర్తి స్థానం గౌరవానికి వన్నె తెచ్చారు. న్యాయ పీఠం నుంచి వర్తమాన భారతాన్ని పరిశీలించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ గారికి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు అవగతమేనని భావిస్తున్నాను. న్యాయకోవిదుడిగా తన విశేష అనుభవంతో రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని ఇనుమడింప చేస్తారని ఆకాంక్షిస్తున్నాను” అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news