విశాఖ ఉక్కు కోసం రంగంలోకి పవన్.. ఎల్లుండి మంగళగిరిలో దీక్ష

-

విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేసేందుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఎక్కడ తగ్గేది లేదు అన్నట్లుగా… కేంద్రం దీనిపై ముందుకు అడుగులు వేస్తోంది. కేంద్రం నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి పక్షాలు, అధికార వైసిపి.. అలాగే విశాఖ ఉక్కు కార్మికులు దీనిపై పోరాటం చేస్తూనే ఉన్నారు.

అయినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం మొండిగా… వ్యవహరిస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ దీక్ష చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎల్లుండి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్షలో పవన్ కళ్యాణ్ తో పాటు పీఏసీ సభ్యులు, జిల్లాల పార్టీ నేతలు దీక్ష చేయబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేయబోతున్న ఈ దీక్షపై బీజేపీ, అధికార వైసీపీ పార్టీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version