రుషికొండ తవ్వకాలపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

-

ఋషికొండ తవ్వకాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. ఋషికొండపై నిర్మాణాల విషయంలో వైసిపి ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిందని నిపుణుల కమిటీ నిర్ధారించిందన్నారు. దీనికి వైసిపి ప్రభుత్వం సమాధానం చెబుతుందా..? లేక రుషికొండ గ్రీన్ మ్యాట్ పై 151 అడుగుల స్టిక్కర్ ను అంటిస్తారా..? అని ప్రశ్నించారు.

తీర ప్రాంతాలు, అడవులను పాడు చేయడం, చెట్లు, కొండలను నరికి వేయడం వైసిపి పాలకుల ముఖ్య లక్షణం అన్నారు. విశాఖపట్నం ఎంతో అందమైన ఊరు అని, ఇటువంటి పర్యాటక ప్రాంతాలను కూడా వదలరా..? అని ప్రశ్నించారు. ఋషికొండల ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించినట్లు నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందన్నారు. ఈ మేరకు ఆయన రుషికొండ తవ్వకాలపై ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news