నరసాపురం బయల్దేరిన పవన్… కాసేపట్లో మత్స్యకార సభకు హాజరు

-

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌… ఇవాళ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొనేందుకు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ కొద్దిసేపటి క్రితం రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు.

ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పవన్‌ కళ్యాణ్‌.. రోడ్డు మార్గం ద్వారా నరసాపురం బయల్దేరారు. మత్స్యకార అభ్యున్నతి సభలో ఆయన ప్రసంగిస్తారు. కాగా… రాజమండ్రి నుంచి పవన్‌ కళ్యాణ్‌ రావుల పాలెం, సిద్దాంతం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుకుంటారు. పవన్‌ కళ్యాన్‌ కు రోడ్డు మార్గంలో అభిమానులు, జన సైనికులు నీరాజనాలు పలికారు. పవన్‌ కళ్యాణ్‌ వారికి అభివాదం చేస్తూ.. ముందుకు సాగారు.

Read more RELATED
Recommended to you

Latest news