వేసవిలో కరెంట్‌ కోతలు ఉండవు – పెద్దిరెడ్డి ప్రకటన

-

ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వేసవికాలం వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్ కొరతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

ఈ సంవత్సరం లక్షకు పైగా వ్యవసాయ విద్యుత్ కలెక్షన్లు ఇచ్చామని మంత్రి తెలిపారు. మార్చిలోగా మిగిలిన కనెక్షన్లు కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ మేరకు విద్యుత్ సరఫరా, పంపిణీ అంశాలపై సచివాలయంలో జెన్ కో, ట్రాన్స్ కో అధికారులతో సోమవారం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. అనంతరం సమీక్ష వివరాలను మంత్రి పెద్దిరెడ్డి మీడియాకు వెల్లడించారు. మార్చి 31 నాటికి 100కు పైగా సబ్ స్టేషన్లు ప్రారంభిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news