Breaking : చంద్రబాబు మోడీ మెడలు వంచాడట : పేర్ని నాని

-

యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కుప్పంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వాడీవేడి ప్రసంగం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు దేవుడు అని, రాముడి లాంటి వాడు అని, తాను మాత్రం వైసీపీ వాళ్ల పాలిట రాక్షసుడ్ని అవుతానని సభాముఖంగా హెచ్చరించారు. అయితే నారా లోకేశ్‌ వ్యాఖ్యలపై మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. పోలీస్‌ గన్‌మెన్ల భద్రతతో బతికే మీరు.. పోలీసుల గురించి ఇంత అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నారు.. పోలీసులను కించపరుస్తూ.. నిర్లజ్జగా మాట్లాడే వారిని ఏమనాలి? అని ప్రశ్నించారు.

ఇటువంటి వారు ఆ పార్టీ అధ్యక్షులు అయితే.. ఆ పార్టీ అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడే చూపిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే.. మీ తొలు ఒలిచి.. పొలీసులకు ‘షూ’ తయారు చేయిస్తానని పేర్ని నాని ఘటు వ్యాఖ్యలు చేశారు. లోకేష్ కుప్పం స్పీచ్‌పై పేర్ని నాని స్పందించారు. ‘ప్రజలు చంద్రబాబు, లోకేష్‌ మాటలను నమ్మే పరిస్థితిలో లేరు. పెన్షన్‌ తీసేశారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం జగన్‌ వల్ల చంద్రబాబు, లోకేష్‌ ఉద్యోగాలే పోయాయి. చంద్ర‌బాబుకు దమ్ముంటే జ‌గ‌న్‌పై ఒంటరిగా పోటీ చేయాలి. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు ఏం చేశారు. మీరు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా జగన్‌ను మిల్లీమీటరు కూడా కదపలేరు. కుప్పం సభలో నారా లోకేష్‌ భరితెగించి అబద్ధాలు మాట్లాడారు. ప్రజలు ఏమనుకుంటారో అన్న ధ్యాస లేకుండా.. మాట్లాడారు’ అని పేర్ని నాని విమర్శలు గుప్పించారు.

నారా లోకేష్ భయం, బెరుకు లేకుండా బరి తెగించి అబద్ధాలు మాట్లాడాడు. బందర్ పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ పూర్తి చేశారట. 5 ఏళ్ళల్లో 5 లక్షల ఉద్యోగాలను వాళ్ళ నాన్న ఇచ్చాడట. అమరావతిని పూర్తి చేశాడట. చంద్రబాబు మోడీ మెడలు వంచాడట. ఇలా బొంకితే ప్రజలు ఏమనుకుంటారో అన్న ఆలోచన లేదు. లోకేష్ చెప్పినట్లు ఇవన్నీ చేసేస్తే ప్రజలు ఎందుకు మిమ్మల్ని కైమా కైమా చేసి ఎందుకు ఇంటికి పంపించారు?? ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడే చంద్రబాబు చెత్త నాయకుడు, ఎందుకు పనికి రాడు అంటాడు’ అంటూ పేర్ని నాని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news