పీఎం కిసాన్ డబ్బులు రాలేదా…? అయితే ఇలా కంప్లైట్ చెయ్యండి..!

-

కేంద్రం రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన రైతులకి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అక్టోబర్ 17న ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన 12వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను విడుదల చేసారు. అయితే ఈ డబ్బులని చాలా మంది రైతులు పొందలేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పీఎం కిసాన్ స్కీమ్‌లో భాగంగా 12 ఇన్‌స్టాల్‌మెంట్స్‌ దాక రూ.16,000 కోట్లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.2.16 లక్షల కోట్లు రైతులకి ఇచ్చారు.

పీఎం కిసాన్ 12వ ఇన్‌స్టాల్‌మెంట్ ని నెల క్రితం విడుదల చేసారు. కానీ కొందరి ఖాతా లో మాత్రం డబ్బులు జమ కాలేదు. దీంతో రైతుల్లో ఆందోళన పడుతున్నారు. అక్టోబర్ 24 లోగా పీఎం కిసాన్ డబ్బులు రైతుల అకౌంట్లలో జమ అవుతాయని చెప్పినప్పటికీ ఖాతాలో పడలేదు. అయితే డబ్బులు కనుక అకౌంట్ లో పడలేదు అంటే ఫిర్యాదు చెయ్యండి.

వెబ్ సైట్ ద్వారా మనం ఫిర్యాదు చెయ్యాలంటే https://pmkisan.gov.in/ ఓపెన్ చేయాలి. ఇక్కడ ఫార్మర్స్ కార్నెర్ సెక్షన్‌లో బెనెఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేయాలి.
ఆధార్ నెంబర్ వివరాలు ఎంటర్ చేసి గెట్ డేటా మీద నొక్కండి.
ఇలా రైతుల ఖాతా లో డబ్బులు పడ్డాయా లేదా అనేది వస్తుంది.

డబ్బులు రవకపోవడానికి కారణం మీ ఆధార్, అకౌంట్ నంబర్ మరియు బ్యాంక్ అకౌంట్ నంబర్‌లోని తప్పు కావచ్చు. అందుకని మీరు మొదట మీ ప్రాంతంలోని వ్యవసాయ అధికారిని సంప్రదించాలి. మీ సమస్యని చెప్పండి. స్పందించకపోతే హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేయవచ్చు.

ఈ పన్నెండో విడత డబ్బు అందని వారు హెల్ప్‌లైన్ నంబర్ 011 24300606 /011 23381092 కు నేరుగా డయల్ చెయ్యచ్చు. సోమవారం నుంచి శుక్రవారం వరకు, PM కిసాన్ హెల్ప్ డెస్క్ (PM KISAN హెల్ప్ డెస్క్) pmkisan [email protected] మెయిల్ ద్వారా సంప్రదించ వచ్చు. ఇలా సమస్య చెప్పి డబ్బులు పొందే అవకాశం వుంది.

Read more RELATED
Recommended to you

Latest news