తుంగభద్ర ట్రైన్‌కు తప్పిన ముప్పు..

-

తుంగభద్ర ట్రైన్‌కు పెను ముప్పు తప్పింది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్​లో గురువారం సాయంత్రం తుంగభద్ర రైలు ఇంజిన్..​బోగీలు లేకుండానే ముందుకు వెళ్లింది. అయితే.. కర్నూల్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన తుంగభద్ర ఎక్స్​ప్రెస్​ సాయంత్రం గద్వాల రైల్వేస్టేషన్​కు వచ్చి ఆగింది. తిరిగి వెళ్లే క్రమంలో ఇంజిన్ కు, బోగీలకు మధ్య ఉండే లూప్ లాక్ తెగిపోవడంతో ఇంజిన్​ఒక్కటే దాదాపు 50 మీటర్ల వరకు వెళ్లింది. గమనించిన లోకో పైలట్​ మళ్లీ ఇంజిన్​ను వెనక్కి తీసుకురావాల్సి వచ్చింది.

తుంగభద్ర రైలుకు తప్పిన ప్రమాదం.. గద్వాల స్టేషన్ లో నిలిచిపోయిన ట్రైన్ |  latest telugu news

కొద్దిసేపటికి బోగీలకు తగిలించుకొని లూప్ లాక్ సరిచేసుకొని తిరిగి తీసుకువెళ్లారు. ట్రైన్ ఫాస్ట్ గా వెళ్లే క్రమంలో లూప్ లాక్ తెగిపోయి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ట్రైన్ ఆగి వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరగడంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news