విశాఖ దుర్ఘటనపై మోడీ ఆరా, జగన్ కి ఫోన్…!

-

విశాఖ గ్యాస్ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీసారు. కేంద్ర హోం శాఖ విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో ఆయన చర్చలు జరిపారు. వేగంగా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రమాదానికి గురైన వారు వేగంగా కోలుకోవాలని ఆయన ప్రార్ధించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు మోడీ. వెంటనే సంబంధిత శాఖలు అప్రమత్తం కావాలని ఆయన సూచించారు.

సహాయక చర్యలను ముమ్మరం చెయ్యాలని సూచించారు. కేంద్ర మంత్రులతో కూడా దీనికి సంబంధించి మాట్లాడారు మోడీ. హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో మోడీ మాట్లాడినట్టు తెలుస్తుంది.ఆయన సిఎం జగన్ కి కూడా ఫోన్ చేసి అడిగినట్టు సమాచారం. వెంటనే చర్యలు తీసుకోవాలని సూచనలు చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news