న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్రకు నేడు శ్రీకారం

-

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన ’న్యాయస్థానం నుంచి దేవస్థానం‘ మహాపాదయాత్ర నేడు ప్రారంభం కానుంది. పాదయాత్రకు షరతులతో కూడిన అనుమతిని ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ఇవ్వడంతో పాదయాత్రం నేడు ప్రారంభం కానుంది. అమరావతిని ఏపీ రాజధానిగా కొనాసగించాలని కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ఈ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. మొత్తం 45 రోజుల పాటు పాదయాత్ర కొనసాగనుంది. సర్వమత ప్రార్థనల అనంతరం తూళ్లురు దీక్షా శిబిరం నుంచి పాదయాత్ర మొదలు కానుంది. రోజుకు 15 కిలోమీటర్ల చొప్పున పాదయాత్ర సాగనుంది.  గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల మీదుగా పాదయాత్రకు చేయనున్నారు. తిరుపతిలో డిసెంబర్ 17 నాటికి చేరుకుని పాదయాత్రను ముగించనున్నారు. దాదాపు 685 రోజుల నుంచి అమరావతి రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు అందోళన చెస్తున్నారు.

మహాపాదయాత్రకు ఏపీలోని ప్రతిపక్షాల నుంచి మద్దతు లభించింది. టీడీపీ, కాంగ్రెస్, సీపీఎం, ఆమ్ ఆద్మీ పార్టీల నుంచి మద్దతు లభించింది. పాదయాత్రకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు తెలిపాలని ప్రజలను టీడీపీ కోరింది.

Read more RELATED
Recommended to you

Latest news